జియో ఉచిత ఆఫర్ .. ఏడూ రోజులే .. డోంట్ మిస్

Update: 2019-10-12 15:49 GMT

జియో తమ వినియోగదారులకు అప్పుడే షాక్ ఇస్తుంది. మళ్ళీ అప్పుడే ఆఫర్స్ కూడా ప్రకటిస్తుంది. ఓ రెండు రోజుల కింద ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే ఆరు పైసలు వసూలు చేస్తామని చెప్పుకొచ్చి పెద్ద షాక్ ఇవ్వడంతో జియో వినియోగదారులు ఇతర నెట్ వర్క్స్ కి మరెందుకు ఆసక్తి చూపారు. దీనితో వినియోగదారులను కోల్పోవద్దు అనే ఉద్దేశంతో 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది జియో . ఈ ఆఫర్ ని ఆరు పైసలు వసూలు చేస్తామని చెప్పిన 48 గంటల్లోనే ప్రకటించడం విశేషం.. తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ వన్-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరి ఈ ఆఫర్ తో అయిన జియో వినియోగదారులు అదే నెట్ వర్క్ లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలి మరి.. 

Tags:    

Similar News