వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఓబీసీల అంశాన్ని ప్రస్తావించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చట్ట సభల్లో వారి సంఖ్య తక్కువగా ఉండడాన్నిగుర్తుచేశారు. దేశంలో సగానికి పైగా జనాభా కలిగిన ఓబీసీలు చట్టసభల్లో మాత్రం తక్కువుగానే ఉన్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవలే ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కూడా వారి సంఖ్య 20 శాతానికి మించలేదని విజయసాయిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు.