మరోసారి పాక్ వక్రబుద్ధి..ప్రధాని మోదీ పర్యటనకు ఎయిర్ రూట్ ఇవ్వని పాక్

Update: 2019-09-18 16:15 GMT

పాకిస్తాన్‌ గగనతలం మీదుగా ప్రధాని నరేంద్రమోదీ విమానం వెళ్లడానికి అనుమతివ్వడంటూ భారత అధికారుల చేసిన విజ్ఞప్తిని పాక్‌ నిరాకరించింది. భారత ప్రధాని మోది త్వరలో న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లేందుకు మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరిస్తున్నట్టు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయానికి తెలిపారు. కాగా ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విమానానికి కూడా పాక్‌ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పాక్‌-భారత్‌ మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించాయి. దీనిలో భాగంగానే గగనతల మార్గాల నుంచి భారత్‌ సర్వీసులను పాక్‌ నిషేధించింది. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వయంగా తెలిపినట్లు పాక్‌ అధికారులు ప్రకటించారు.  

Tags:    

Similar News