మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నెగ్గారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఇవాళ సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన తర్వాత జరిగిన ఓటింగ్లో ఉద్దవ్ ప్రభుత్వం నెగ్గింది. ఠాక్రే ప్రభుత్వానికి మద్దతుగా 169 ఓట్లు పోలయ్యాయి.