కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న ప్రస్తుతం తరుణంలో సంకీర్ణ సర్కార్కు ప్రమాదం వచ్చే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, రమేష్ జెర్కీహోలీలు రాజీనామాలు చేశారు. దీంతో సంకీర్ణ సర్కార్ బలం అసెంబ్లీలో 117కి పడిపోయింది. కర్ణాటక పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. కర్ణాటక రాష్ట్ర సీఎల్పీ లీడర్ సిద్దరామయ్య కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ను తన నివాసంలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాపై సమావేశంలో చర్చిస్తున్నారు.