హిమాచల్ ప్రదేశ్ లో దారుణం .. మూడంతస్తుల భవనం కుప్ప కూలింది

Update: 2019-07-14 14:52 GMT

హిమాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది ..అందరు చూస్తుండగానే మూడంతస్తుల భవనం కుప్ప కూలింది . అయితే ఈ శిథిలాల కింద 37 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది . ఇందులో ముప్పై మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తుంది . వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్‌లు 21 మందిని బయటకు తీశాయి. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుండి భారీ వర్షాలు రావడం వల్లే ఈ సంఘటన జరిగిందని సమాచారం.. 



Tags:    

Similar News