HD Kumaraswamy: కాంగ్రెస్ ఓటమే లక్ష్యం.. భాజపాతో ఇంకా పొత్తు కుదర్లేదు
HD Kumaraswamy: సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే
HD Kumaraswamy: కాంగ్రెస్ ఓటమే లక్ష్యం.. భాజపాతో ఇంకా పొత్తు కుదర్లేదు
HD Kumaraswamy: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే తమ లక్ష్యమన్నారు JDS చీఫ్ కుమారస్వామి. అయితే బీజేపీతో పొత్తుపై మాత్రం తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీజేపీతో సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నారు. కర్ణాటకలో BJP, JDS మధ్య పొత్తు గురించి ఇటీవల వార్తలు రాగా.. మాజీ సీఎం యడియూరప్ప కూడా కలిసి పోటీ చేస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన కుమారస్వామి.. తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని.. ఆ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 3, 4 స్థానాలు బీజేపీ.. జేడీఎస్కు కేటాయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.