తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగడం పరిస్థితులు అదుపు తప్పుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై హడావిడిగా ఢిల్లీ వెళ్లడం ఆసక్తిగా మారింది. మరికాసేపట్లో ప్రధాని మోడీతో ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశంకానున్న తమిళిసై తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇవ్వనున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా, ప్రభుత్వంపైనా, పోలీసుల దమనకాండపై ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదుచేసిన తర్వాతి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లడం కలకలం రేపుతోంది.