సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది :ఎంపీ కేశినేని నాని
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును జగన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది ప్రాంతీయ భాషా పరిరక్షణపై ఎంపీ కేశినేని నాని ప్రశ్న త్రిభాష విధానాన్ని అమలు చేయాలి
ప్రాంతీయ భాషా పరిరక్షణపై ఎంపీ కేశినేని నాని పార్లమెంట్లో ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును జగన్ ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. త్రిభాష విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో భాషాన్ని ప్రమోట్ చేయటానికి సంబంధిత శాఖ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు.