పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం

Update: 2020-03-30 09:25 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 మంది మత్స్యకారులు చెన్నై హార్బర్ వద్ద చిక్కుకుపోయారని, వారిని ఆదుకోవాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి సంబందించిన విజ్ఞాపనను పవన్ కల్యాణ్ తమిళంలో ట్వీట్ చేశారు. పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

Tags:    

Similar News