ఢిల్లీని తాకిన బిగ్ బాస్ -3 లొల్లి

Update: 2019-07-19 07:58 GMT

 బిగ్ బాస్ -3ని వివాదాలు వీడటం లేదు. కార్యక్రమాన్ని నిలిపి వేయాలంటూ ఇప్పటివరకు ఫిర్యాదులు.. న్యాయపోరాటలు చేసిన వ్యతిరేకులు. తాజాగా ఢిల్లీలో నిరసనకు దిగారు. జంతర్ మంతర్ దగ్గర సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డితో పాటు నటి గాయత్రిగుప్తా, శ్వేతారెడ్డిలు ఆందోళనకు దిగారు. తక్షణమే బిగ్ బాస్ షో రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ పేరుతో అశ్లీలత పోత్సహిస్తున్నారని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. బిగ్‌ బాస్ షోలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు విమర్శించారు. బిగ్ బాస్‌ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎందాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

Tags:    

Similar News