సూపర్ స్టార్ రజనీకాంత్ కు విమాన ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి మైసూరు బయలుదేరిన ట్రూజెట్ విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలెట్ విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు తెలియజేయడంతో అత్యవసరంగా విమానం దిగేందుకు అనుమతిచ్చారు. దీంతో విమానం తిరిగి చెన్నై ఎయిర్ పోర్టులో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో దాదాపు 48 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.