వరద నీటిలో యువతి ఫొటో షూట్‌..వీడియో వైరల్

Update: 2019-09-30 14:56 GMT

బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎడ తెరిపిలేకుండా వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జనావాసాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో భారీ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్‌ జరిపారు. నిఫ్ట్ విద్యార్తిని అదిథి సింగ్ పాట్నాలో వరదనీటితో నిండిన రోడ్డుపైకి కారులో వచ్చింది. అదిథి సింగ్ కారు వద్ద ఫొటోలు దిగి వాటిని ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం పట్నాలో ఉన్న పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు తాము ఇలా చేశామని ఫొటో షూట్‌ జరిపిన వారు తెలిపారు. అయితే ఈ ఫొటో షూట్‌ను కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.


 

Tags:    

Similar News