అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్వాగతించారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదు.. ప్రతి ఒక్కరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదన్నారు. అయోధ్య కేసులో తీర్పు జాప్యమైనా తాజా తీర్పును స్వాగతిస్తామని అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థాన తీర్పును అనుసరిస్తామన్న ఆయన భారతీయులను హిందు, ముస్లింలు అంటూ రెండు వర్గాలుగా చూడబోమని తెలిపారు.