ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి !

Update: 2020-05-20 04:46 GMT

ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేందుకు వెళ్ళిన రైతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎటవా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు. పండ్లను విక్రయించడానికి రైతులు ట్రక్కులో వస్తుండగా.. ఎటవా ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఎదురెదుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు.

మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ఎటవా జిల్లా ఎస్పీ ఆర్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Tags:    

Similar News