అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పును అందరూ గౌరవించాల్సిందేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా. రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణానికి ద్వారాలు తెరవడమే కాదు బీజేపీ, ఇతర పక్షాలకు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ద్వారాలు మూసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.