వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: రాహుల్ గాంధీ

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్‌ గాంధీ రెండో రోజు పర్యటించారు.

Update: 2019-08-12 11:51 GMT

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్‌ గాంధీ రెండో రోజు పర్యటించారు. వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన, సహాయక చర్యలపై కేంద్రం మరింత దృష్టి సారించాలని సూచించారు. వయనాడ్‌ లోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు.

Tags:    

Similar News