రాహుల్‌.. జాగ్రత్త : సుప్రీంకోర్టు

Update: 2019-11-14 05:59 GMT

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో రాహుల్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌పై దాఖలైన ఈ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. రాహుల్‌ గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. రాహుల్‌ భవిష్యత్‌లో సంయమనం పాటించాలని కోర్టు ఆదేశించింది. 

Tags:    

Similar News