రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు : మోదీ
-పెరుగుతున్నసాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేటు -విద్యార్ధులు పుస్తకాలు చదవడం మానేసి గూగుల్లో వెతుకుతున్నారు
మన జీవన విధానమంతా ప్రకృతితోనే ముడిపడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతి బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో తన అభిప్రాయాలను ప్రధాని పంచుకున్నారు. రాజకీయాల్లోకి వస్తానని చిన్నతనంలో అనుకోలేదని.. ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేటుగా మారిందన్నారు. విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేసి, గూగుల్లో వెతుకుతున్నారని అన్నారు. ఫిట్ ఇండియా విషయంలో పాఠశాలలకు ర్యాంకులు కేటాయించాలన్నారు. అయోధ్య తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమన్నారు.