బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందన..అభివృద్ధిని పరుగులు పెట్టించేలా..

Update: 2019-07-05 10:06 GMT

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది అత్యుత్తమ బడ్జెట్ అని కితాబిచ్చారు. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో భారత అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల పారిశ్రామికరంగం బలపడుతుందని, దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు. పన్ను విధానాన్ని సరళతరం చేశామని చెప్పారు. మౌలిక వసతులను ఆధునికీకరించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దామని అన్నారు. వ్యవసాయరంగాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైనవి బడ్జెట్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని మోడీ అన్నారు.

 

Tags:    

Similar News