జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ స్పందించారు. ఈ సందర్బంగా పాకిస్థాన్ మరో మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇమ్రాన్కు అంతర్జాతీయ రాజకీయాలపై సరైన అవగాహన లేదని ఆయన అపరిపక్వంగా ప్రవర్తించారని, ఈ విషయంలో భారత్ చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్ సరిగా తిప్పికొట్టలేకపోయారన్నారు. కాగా ఈ దాడికి దాడికి పాల్పడింది.. జైషే ఉగ్రవాదే అని ముష్రరఫ్ అన్నారు. అయితే ఇందులో పాకిస్థాన్ హస్తం లేదని ఆయన అన్నారు.
ఓ ప్రైవేటు టీవీ ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పుల్వామా దాడి దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. గతంలో తన మీద కూడా జైషే ఉగ్రవాద సంస్థ దాడి చేసిందని, ఈ సంస్థపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కూడా సానుభూతి ఉందని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి సరిగాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం ఇలా చేయదన్నారు. కాగా ఈనెల 14వ తేదీన పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారు.