కేరళలో సంవత్సరం వయసున్న బాలుడు లాటరీలో రూ. 7 కోట్లు గెలుచుకున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ భారతీయుడికి కొడుకు రూపంలో అదృష్టం వచ్చింది. ఏకంగా రూ. 7 కోట్ల విలువ చేసే లాటరీ తగలడంతో అతని సంతోషానికి అవుదులు లేకుండా పోయాయి. కేరళకు చెందిన రమీస్ రెహమాన్ దుబాయ్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు.
అతడు తన కొడుకు మొహమ్మద్ సలాహ్ పేరు మీద రాఫిల్ డ్రాలో ఒక లాటరీ టికెట్ కొన్నాడు. సిరీస్ 323కు సంబంధించి 1319 నెంబర్ గల టికెట్ను రమీస్ కొన్నాడు. ఆ టికెట్ ఈ నెల తీసిన డ్రాలో ఎంపికయింది. ఈ లాటరీ తీసిన ఆ సంస్థ రమీస్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. రాత్రికి రాత్రే ఆ కుటుంబం దశ మారడంతో అంతా సంతోషంలో మునిగిపోయారు.