సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : ముస్లిం పర్సనల్ లా బోర్డు

Update: 2019-11-09 06:38 GMT

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఇది ఎవరి గెలుపు కాదు.. ఎవరి ఓటమి కాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పింది. అందరు సంయమనం పాటించాలని తెలిపింది. తాము అనుకున్నట్టు తీర్పు రాలేదని అయినా తీర్పు అనందాన్ని కలిగించిందని చెప్పింది. సుప్రీం తీర్పు చారిత్రకమని స్పష్టం చేసింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటామంది.

Tags:    

Similar News