నిర్భయ హత్యాచార ఘటనలో దోషులకు ఏకకాలంలో ఉరిశిక్ష అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఉరిశిక్ష అమలుకు కోర్ట్ డెత్ వారెంట్ కోసం వేచి చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అక్షయ్కుమార్సింగ్ రివ్యూ పిటిషన్ ఈనెల 17న సుప్రీంకోర్టు విచారించనుంది.
అయితే నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలనే పిటిషన్పై విచారణ డిసెంబర్ 18కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను నిర్భయ తల్లిదండ్రులు దాఖలు చేశారు. అక్షయ్కుమార్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది ఢిల్లీ పటియాల హౌస్కోర్టు.