ట్విట్టర్ ఫాలోయింగ్ లో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు . ఇప్పటికే అయన తన ట్విట్టర్ ఖాతాలో 50 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ను దాటేశారు . అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు 64 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు . ఇక అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా 108 మిలియన్ల ఫాలోవర్స్తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు . ఇక ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా, అక్కడ వివిధ వేదికలలో పాల్గొన్నవి ఆయన చేసిన ప్రసంగాల , అయన చూసిన ప్రదేశాలు మరియు ఆయన కలిసిన వ్యక్తుల వివరాల గురించి అయన తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఉంటారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ట్విట్టర్ ఖాతాను ఉపయోగిస్తున్నారు . ఇక అయన ప్రధాని అవ్వడంతో ఆయన ట్విట్టర్ ఖాతాలో మరింత మంది చేరిపోయారు.