మోడీకి ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్ యూఏఈ..

Update: 2019-08-24 11:59 GMT

ప్రధాని మోడీ అబుదాబీ పర్యటనలో ఉన్నారు. అబుదాబీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి యూఏఈ ప్రభుత్వం ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్‌ యూఏఈ పురస్కారాన్ని అందజేసింది. మరికాసేపట్లో యూఏఈ రాజు మహమ్మద్ బిన్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్‌ మహ్మద్‌ బీన్ జయేద్ అల్‌ నహ్యాన్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ నరేంద్ర మోడీకి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ వద్ద స్వాగతం పలికారు. భారత్‌కు యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడంతో.. వ్యాపార,ఆర్థిక లావాదేవీలపై చర్చలు జరపనున్నారు. మోడీ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరుదేశాలు భావిస్తున్నాయి. 


Tags:    

Similar News