దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేసే అంశంపై సీఎంలతో సమీక్షించారు. అయితే ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కొనసాగించడమే మంచిదని పలు రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కోరినట్లు సమాచారం. మరోవైపు మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇక మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడగించాలని మేఘాలయా సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రధానిని కోరారు. గ్రీన్ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించాలన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం మేఘాలయలో 12 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒకరు మరణించారు.