ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..

Update: 2019-01-09 14:21 GMT

మహారాష్ట్రలోని నాగపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం పట్టణంలోని కింగ్స్‌వే రోడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ మల్టీ స్పేషలిటీ ఆసుపత్రిలో జరిగింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 200 కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో చాలా మంది బయటకు పరుగులు తీయగా కోంత మంది మంటల్లో చిక్కుకుపోయారు. వారిని ఫైర్ సిబ్బంది రక్షించే ప్రయత్నాలు చేపట్టింది. 

Similar News