ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ..గవర్నర్‌తో విడివిడిగా భేటీ కానున్న శివసేన, బీజేపీ

Update: 2019-10-28 06:44 GMT

మహారాష్ట్ర రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ, శివసేన స్పష్టత ఇవ్వకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీతో ఇరు పార్టీల నేతలు భేటా కానుండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గవర్నర్‌తో శివసేన నేత దివాకర్‌ రౌత్‌, సీఎం ఫడ్నవీస్‌ భేటీకానున్నారు. వీరిద్దరి భేటీ వార్తలను రాజ్‌భవన్‌ వర్గాలు సైతం ధృవీకరించాయి. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేవలం దీపావళి పండగ సందర్భంగ మాత్రమే కలుస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News