కేంద్రం విధించిన లాక్డౌన్ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఏకంగా 6 గంటల పాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అందరూ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటారు.
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ 4 నిబంధనలను ఖరారు చేశారు. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం తర్వాత హోంశాఖ కార్యదర్శి లాక్డౌన్ 4 నిబంధనలను ప్రకటించనున్నారు. ఈ సారి వచ్చే లాక్డౌన్ 4 నిబంధనలు ఎవరూ ఊహించని విధంగా విభిన్నంగా ఉంటాయని గతంలో ప్రధాని చెప్పుకొచ్చారు. దీంతో లాక్డౌన్ 4 ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.