హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ముహూర్తం ఖరారరైంది. డిప్యూటీ సీఎంగా జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ప్రమాణం చేయనున్నారు. జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అంతకుముందు ఖట్టర్ను శాసనాసభా పక్షనేతగా బీజేఎల్పీ ఎన్నుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ ఆధ్వర్యంలో శాసనసభా పక్షం సమావేశం జరిగింది.
హర్యానా గవర్నర్తో ఖట్టర్, దుష్యంత్ చౌతాలా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీలో మెజారిటీ ఉందని ఖట్టర్ , చౌతాలా గవర్నర్కు వివరించారు. మరోవైపు జేజేపీ నేత దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలాకు పెరోల్ లభించింది. అజయ్ చౌతాలకు రెండు వారాల పెరోల్ లభించింది. తీహార్ జైలు నుంచి అజయ్ చౌతాలా విడుదల కానున్నారు.