రాజ్యాంగానికి అనుగుణంగానే నా నిర్ణయం- స్పీకర్‌...

Update: 2019-07-11 14:17 GMT

రాజ్యాంగ బద్దంగానే తన నిర్ణయం ఉంటుందన్నారు కర్నాటక విధాన సౌధ స్పీకర్ రమేష్. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనను కలిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన గవర్నర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో ఒకరిని రక్షించాలనే ధోరణి తనకు లేదన్నారు. ఎమ్మెల్యేలు తనను కలిసిన సమయంలో తీసిన వీడియాను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపుతానంటూ తెలియజేశారు. దేశ హితం కోరుకునే పౌరుడిగా ... రాజీనామాలకు గల కారణాలు తెలుసుకుంటాన్నారు. 13 మందిలో 8 మంది రాజీనామాలు స్పీకర్‌ ఫార్మాట్‌లో లేవన్న ఆయన రాజీనామాలు ఆమోదించే విషయంలో ఉద్దేశ పూర్వక తాత్సారం లేదన్నారు .

Tags:    

Similar News