కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది.