కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి షాక్ తగిలింది. సీబీఐ కస్టడీని సవాలుచేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 5వరకు చిదంబరం సీబీఐ కస్టడీ కొనసాగించాలన్న సుప్రీంకోర్టు అప్పటివరకు తీహార్ జైలుకు తరలించొద్దని ఆదేశించింది. సెప్టెంబర్ 5న చిదంబరం బెయిల్ పిటిషన్ను విచారించాలంటూ ట్రయల్ కోర్టును సుప్రీం ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయం తర్వాత సుప్రీంలో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.