మద్యం మత్తులో ఓ ఐఏఎస్ అధికారి బీభత్సం సృష్టించాడు . బాగా మద్యం సేవించి మీతిమిరిన వేగంతో కారును నడిపి బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. దీనితో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు . మృతి చెందినా వ్యక్తి మలయాళం జర్నలిస్ట్ మహమ్మద్ బషీర్(35)గా గుర్తించారు . ఈ సంఘటన శనివారం రోజు ఉదయం కేరళలోని తివేండ్రంలో చోటు చేసుకుంది . మీతిమీరిన వేగంతో కారు నడిపి బైక్ ని ఢీకొట్టడంతో 100 మీటర్ల దూరంలో బైక్ ఎగిరిపడింది . దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . అయితే మహమ్మద్ బషీర్ మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు .