కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది కలకలం

Update: 2019-06-28 01:39 GMT

కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 600కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబల్లాపుర పట్టణంలో ఒక అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు గురువారం అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడిన వ్యక్తిని బంగ్లాదేశ్‌ జాతీయుడిగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఎంబీ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై తాను సీఐడీ అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ విషయం జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) పరిధిలో ఉడటంతో ఇంతకు మించి తానేం మాట్లాడలేనని తెలిపారు. దర్యాప్తు సంస్థకు అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. 

Similar News