దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు !

Update: 2019-12-06 11:26 GMT

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ కేసు నిందితులను కాల్చిచంపిన పోలీసులపై ప్రశంస వర్షం కురుస్తోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించారు ఓ వ్యాపారవేత్త. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ . రాహ్ గ్రూప్ చైర్మన్ అయిన నరేశ్ తెలంగాణ పోలీసులు నిందితులను చంపేసి, చాలా మంచి పని చేశారని కొనియాడారు. రాహ్‌ గ్రూప్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


  

Tags:    

Similar News