మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరికాసేపట్లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్నని అందుకోనున్నారు . భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ చేతుల మీదిగా ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు .ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 13వ భారత రాష్ట్రపతి అయన 2012 నుండి 2017 వరకు రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వహించారు . ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగానే కాకుండా కాంగ్రెస్ హయంలో నాలుగుసార్లు కేంద్ర మంత్రిగా భాద్యతలు నిర్వహించారు .