జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బోనాబజార్లో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు. సోదాలు చేస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనేది ఇంకా తెలియలేదు.