జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సీఈవో సునీల్ అరోరా నేతృత్వంలో సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూకశ్మీర్, ఏపీ, తెలంగాణ, సిక్కింలో అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చించింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా అక్కడ అసెంబ్లీ స్థానాల పెంపుపై ఈ ఉన్నత స్థాయి భేటీలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.