ఈనెల 28న ఎన్నికలకు షెడ్యూల్‌!

Update: 2019-02-14 01:33 GMT

2019 సార్వత్రిక సమరానికి ఈ నెల 28న వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 28న షెడ్యూల్‌ విడుదలైతే.. మొదటిదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ మార్చి 3న వెలువడనుంది. మొదటిదశ ఎన్నికలకు మార్చి నాలుగో వారంలో ఎన్నిక జరగనుంది. దీంతో ఎన్నికల సంఘం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ.. అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లు సీఈసీకి నివేదికలు అందించారు. కాగా ఈసారి 5 దశల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం ఐదు దశల్లో, 55 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఈసీ కసరత్తు పూర్తి చేసింది. మే మొదటి వారంలో ఓట్ల లెక్కింపు జరిగేలా.. షెడ్యూల్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Similar News