ట్రంప్‌ మెచ్చిన బాలీవుడ్ చిత్రం ఇదే!

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ 'ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా.

Update: 2020-02-22 10:37 GMT

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ 'ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా.. తాజాగా అయిన నటించిన 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (Shubh Mangal Zyada Saavdhan) చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకొని దూసుకుపోతుంది. ఇందులో జితేంద్ర కుమార్‌ మరో ప్రధానపాత్రలో నటించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి హితేష్ కేవల్య దర్శకత్వం వహించాడు.

అయితే ఈ బాలీవుడ్‌ చిత్రంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించాడు. ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్‌ కూడా పెట్టారు.ఇంతకి ఎం జరిగింది అంటే బ్రిటీష్ మానవ హక్కుల కార్యకర్త పీటర్ గ్యారీ టాచెల్ ఈ సినిమాపై ఒక ట్వీట్ చేశారు. హిందీలో స్వలింగ సంపర్కులకు సంబందించి ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ రిలీజయ్యింది. భారత్‌లో స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత వచ్చిన తరువాత, ఇప్పుడు విడుదలైన ఈ చిత్రం స్వలింగ సంపర్కం గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే అయన చేసిన ట్వీట్ పైన ట్రంప్ రీట్వీట్ చేస్తూ.. 'గ్రేట్' అని కామెంట్ చేశారు.

తమ సినిమాపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇక ట్రంప్ త‌న భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జేరడ్ కుషనర్‌‌తో క‌లిసి ఈ నెల 24న భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.. అయన పర్యటన కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.   

Tags:    

Similar News