సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా.. శివసేనపై తీవ్ర విమర్శలు..

Update: 2019-11-08 12:08 GMT

మహారాష్ట్ర సీఎం పదవికి పడ్నవీస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. శివసేనపై పడ్నవీస్ ఘాటు వ్యాఖలు చేశారు. శివసేన నేతలు ఎవరు తనను కలవలేదన్నారు. శివసేన వ్యవహరించిన తీరు చాలా బాధకరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్, ఎన్ సీపీని శివసేన కలిసిందని ఆరోపించారు. ఉద్ధవ్ ను కలిసేందుకు ప్రయత్నంచినా ఆయన స్పందించలేదని ఫడ్నవీస్ చెప్పారు. రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా తాను ప్రయత్నించానని తెలిపారు. సీఎం పదవిపై ఆశలతో శివసేన నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై వారి వ్యాఖ్యలు సరైనవి కావని హితవుపలికారు. తమ భవిష్యత్తు కార్యాచరణను కేంద్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని ఫడ్నవిస్‌ తెలిపారు.

Tags:    

Similar News