ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తన ట్విట్టర్లో ఆయన ఈ విషయంపై స్పందించారు. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో.. ముంబై తరహాలో ఢిల్లీలోనూ మీడియా ప్రతినిధులకు మూకుమ్మడిగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని కేజ్రీవాల్కు ట్వీట్ ద్వారా ఓ వ్యక్తి చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందిస్తూ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Sure. We will do that https://t.co/ehcY5OMiEP
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2020