ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అయన జైల్లో నాలుగు కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని అయన తరుపున న్యాయవాది అయిన కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వెల్లడించారు...
ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకి బెయిల్ మంజూరు చేయాలనీ అయన కోర్టును కోరారు. వచ్చేది శీతాకాలం కాబట్టి డెంగ్యు కూడా వచ్చే అవకాశం ఉందని అయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు... సాక్షాలను ప్రభావితం చేస్తారని అనుమానం ఉంటే ప్రభుత్వం రక్షణ కల్పించొచ్చు అని సూచించారు. ప్రస్తుతం అయన బెయిల్ ని కోర్టు రిజర్వులో ఉంచింది.