పలు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ గవర్నర్గా జగదీష్ ధన్కర్, త్రిపుర గవర్నర్గా రమేశ్ బైస్, బిహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్, నాగాలాండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించారు. అలాగే ఇప్పటివరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన ఆనంది బెన్ పటేల్.. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బదిలీ అయ్యారు. అలాగే బిహార్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన లాల్జీ టాండన్.. మధ్యప్రదేశ్ గవర్నర్గా బదిలీ అయ్యారు.