హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్

Update: 2019-10-25 07:37 GMT

హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. బీజేపీకి మద్దతు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో జేపీ నడ్డాతో హర్యానా సీఎం ఖట్టర్ సమావేశమై చేర్చించారు. రేపు హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.

40 సీట్లను గెల్చుకున్న బీజేపీకి అధికారాన్ని చేపట్టేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన వేళ... ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు ప్రకటించారు. వీరి మద్దతుతో బీజేపీ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ (46) కంటే ఒకటి ఎక్కువగానే ఉండబోతోంది.

Tags:    

Similar News