లోక్సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే ఆజంఖాన్ మాట్లాడుతూ.. నాకు డిప్యూటీ స్పీకర్పై ఎలాంటి దురుద్దేశం లేదు. సభలోని ప్రతీ ఒక్కరికి నేనేం మాట్లాడానో తెలుసు. నా వ్యక్తిత్వం గురించి తెలుసు. అయితే, నేను తప్పు చేశానని సభ భావిస్తే అందుకు క్షమాపణ చెబుతున్నా అని తెలిపారు. ఇక నుంచినైనా మహిళలను కించపరిచేవిధంగా మాట్లాడరాదని ఆజంఖాన్ కు డిప్యూటీ స్పీకర్ రమాదేవి సూచించారు.
అయితే ఆజంఖాన్ క్షమాపణ అభ్యర్థనను లోక్సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవి తిరస్కరించారు. ఆయన ప్రవర్తన దేశాన్ని, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అది మార్చుకోవాల్సిందే' అని రమాదేవి స్పష్టం చేశారు.