అసోంలో జాతీయ జనాభా తుది జాబితా విడుదల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దీంతో వాస్తవాలు వెల్లడయ్యాయని అక్రమ వలసదారులన్న అపనింద దీనితో తొలగిపోయిందని ఆయనన్నారు. జాబితా తయారీలో లోపముందన్న విషయం స్పష్టంగా తేలిపోయిందని, ఒవైసీ అన్నారు. అసోంలో జరుగుతున్న జనాభా లెక్కింపు విధానం అంతా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే జరుగుతోందని, బీజేపీ అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తోందని అన్నారు.