ఎన్నికల సమయంలో పార్టీలన్నీ హామీలను కుమ్మరించడం అనేది సహజమే .. అందులో భాగంగానే ఢిల్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ సర్కార్ బంపర్ ఆఫర్ ని ప్రజల ముందు ఉంచింది . ఒక్కొకరికి నెలకు 15 జీబీ డేటాను ఇస్తామని హామీని ఇచ్చింది . దీనికోసం 11 వేల హాట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు . దీనిని మరో మూడు లేదా నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు . అయితే దీనికంటే ముందే నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని అయన హామీ ఇచ్చారు .
Delhi govt fulfills it's major election promise of providing free Wi-Fi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 8, 2019
Cabinet approves creation of 11,000 hotspots across Delhi.
This is the single biggest initiative of a govt anywhere in the world providing such a big number of free Wi-Fi hotspots